schedule Saturday, June 13, 2026

వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలి వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

calendar_today December 5, 2024
person meenewstelugu

వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4 ::::: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేంతవరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో నిర్వహించిన రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్షలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు పోతురాజు నేతృత్వంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి 6000 పింఛన్లు వెంటనే పెంచాలని అరగుండ్లు కొట్టించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం

           ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేంతవరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలను అన్నింటిని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా ఆయన నిర్వహించిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం రెండవ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన సంఘం జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ తో కలిసి కొడంగల్ లోని అంబేద్కర్ వద్దకు చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని నినదిస్తూ సంఘం నేతలతో కలిసి అరగుండు కొట్టించుకొని వినూత్న రీతిలో ప్రభుత్వానికి తన నిరసన తెలిపిన ఆయన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మెజార్టీ స్థానాలు వస్తే వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు ఆ హామీని అమలు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తిరుగుబాటు యుద్ధాన్ని ప్రారంభిస్తామని తెలిపిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు 6000 పెన్షన్ పెంచాలని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖ కు వికలాంగుండే మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు సంఘం జిల్లా అధ్యక్షులు పోతురాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ షరీఫ్ సంఘం జిల్లా మహిళా నాయకురాలు భూదారి అలివేలు సంఘం దారూర్ మండల అధ్యక్షులు హరిజన్ బాలరాజ్ మండల ఉపాధ్యక్షులు జానీ మహేష్ సంఘం దోమ మండల అధ్యక్షులు మాణిక్య చుక్కయ్య కీతావత్ భాస్కర్ వడిత్య పాండు సంఘం వర్ధన్నపేట అధ్యక్షులు జేట్టబోయిన శ్రీనివాస్ సంఘం రాయపర్తి మండల అధ్యక్షుడు ఇస్లావత్ బాలకృష్ణ మౌనిక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు తలారి సహదేవుడు చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు వెంకన్న బొమ్మరాజు పెట్ మండల అధ్యక్షులు అబ్బన బోని మందప్ప సంఘం మండల అధ్యక్షులు మాన్య నాయక్ నాయకులు అద్దంకి సైదులు ఇస్లావతు రామచందర్ వడిత్య లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు