పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్
calendar_today
March 22, 2025
person
meenewstelugu
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్
మీ న్యూస్ ప్రతినిధి::
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. శుక్రవారం 10వ తరగతి పరీక్షలు జిల్లాలో 67 కేంద్రాలలో ప్రారంభం కాగా సూర్యాపేట పట్టణంలోని నెంబర్ టు గవర్నమెంట్ హైస్కూల్లో అలాగే జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో 11915 విద్యార్థులకు గాను 11890 విద్యార్థుల హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈరోజు జరిగిన పరీక్షకు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేయబడలేదని, పరీక్షలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.