schedule Saturday, June 13, 2026

ముత్యంరాజు గురుస్వామి కీ ఘన సన్మానం 

calendar_today April 18, 2025
person meenewstelugu

ముత్యంరాజు గురుస్వామి కీ ఘన సన్మానం 

 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట ఏప్రిల్ 18:పరుశరామ నిర్మితమైన శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం వద్ద అవార్డు అందుకున్న రంగు ముత్యరాజు గురుస్వామిని పలువురు శుక్రవారం ఘనంగా సన్మానించారు.

పలువురికి విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయులు గురు భక్తి తో అయ్యప్ప స్వామి దీక్ష లో తాము ఎంచుకున్న గురుస్వామి రంగు ముత్యంరాజు కు పురస్కారం వచ్చిన సందర్బంగా సత్కరించి సన్మానించడం సూర్యాపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది.

సూర్యాపేట కు చెందిన సీనియర్ గురుస్వామి రంగు ఘనంగా సన్మానించారు.ముత్యం రాజు కు ఇటీవల శబరి మల అయ్యప్ప స్వామి సన్నిధి లో పరశురామ పురస్కారం వచ్చిన సందర్బంగా పలువురు ని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు సన్మానం చేశారు. కార్తిక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టి గురు స్వామి ద్వారా దీక్ష పూర్తి చేసుకోవడం ఆనవాయుతి అన్నారు. అవార్డు వచ్చిన సందర్బంగా నన్ను సన్మానించి నాపైన గురత్వర బాధ్యత ఉంచారాని, అయ్యప్ప స్వామి దీక్ష వ్యాప్తికి, స్వాములను సన్మార్గంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తాన్నారు.ఈ కార్యక్రమం లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉపాధ్యక్షలు భూపతి శ్రీనివాస్ స్వామి, అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ మాజీ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్ చౌదరి, ఉపాధ్యాయులు , కే రమేష్, గుణగంటి శ్రీనివాస్, జి లక్ష్మణ్ ముంతా శ్రీనివాస్, లిగాల రవి, చౌదరి రెడ్డి, కరుణాకర్, భాస్కర్,నాగయ్య, నిమ్మల శ్రీనివాస్, నాగయ్య, మొరిశెట్టి సత్యనారాయణ, యానాల సుధాకర్ రెడ్డి, తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సన్మానం కార్యక్రమం నకు ముందు ఆలయ అర్చకులురెంటల సతీష్ శర్మ, కోటి శర్మ లుప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం అందజేశారు.