మీ న్యూస్ తాండూర్:::తాండూరు. వర్త్య తారా భాయి ఆత్మకు శాంతి చేకూరాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ భగవంతుని ప్రార్థించారు.ఆదివారం తాండూర్ పట్టణం ఇందిరానగర్ లో వర్త్య ప్రశాంతి భాయి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ 13వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సురేష్ నాయక్,మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు రాజ్ కుమార్, డాక్టర్ తుకారం,వర్త్య ప్రశాంతి,కుటుంబ సభ్యులు (ప్రభుత్వ ఉద్యోగులు)వర్త్య రమేష్ నాయక్, రేణుక భాయ్ తదితరులు ఉన్నారు.