schedule Saturday, June 13, 2026

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

calendar_today September 3, 2024
person meenewstelugu

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

--అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం

--ఎకరాకు 20000 ప్రభుత్వం పరిహారం చెల్లించాలి

--రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్

మీ:న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని తమ్మరలో వరద ఉధృతికి నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు.చెరువుకు విపరీతమైన వరదరావడంతో వరద వెళ్లే మార్గం లేక చెరువు నుండి తూము కి వెళ్లే కాలువకు గండి పడటంతో గ్రామానికి చెందిన కెవిఎల్ ఎన్ ప్రసాద్ పొలంలో ఇసుక మేటలు వేయడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా గ్రామంలో 500 ఎకరాల వరకు వర్షం నీటితో మునిగిపోయి రైతులు, ముఖ్యంగా కౌలు రైతులకు తీరని నష్టం కలిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో అంచనా వేయించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కే వి ఎల్ ఎన్ ప్రసాద్, మాతంగి ప్రసాద్, రాధాకృష్ణ, బత్తిని రమేష్, బొల్లు నరేష్, సామినేని నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.