schedule Saturday, June 13, 2026

కోదాడ మాజీ ఎంపీపీ పిడమర్తి రమేష్ బాబు మృతి

calendar_today September 3, 2024
person meenewstelugu

కోదాడ మాజీ ఎంపీపీ పిడమర్తి రమేష్ బాబు మృతి

 

మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్

  సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎంపీపీ పిడమర్తి రమేష్ బాబు సోమవారం అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందారు.కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన రమేష్ బాబు రాజకీయాల్లో వార్డు సభ్యుడిగా,గ్రామ ఉపసర్పంచ్, కోపరేటివ్ చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా గణపవరం గ్రామాన్ని కోదాడ ఎంపీపీగా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి ప్రజలకు వారు విశేష సేవలు అందించాలని వారి సేవలను పలువురు కొనియాడారు.కుల మతాలు పార్టీలకు అతీతంగా అందరినీ కల కలుపుకొని ఆప్యాయంగా ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కాగా వారి మృతి పట్ల కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు గ్రామ మాజీ సర్పంచ్ పొట్ట విజయ కిరణ్, హిమబిందు, సుమన్ రెడ్డి అన్ని పార్టీల నాయకులు ఆయన భౌతిక కాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు........