schedule Saturday, June 13, 2026

NSP కాలువ ఎడమ పరిశీలించిన బిజెపి నాయకులు

calendar_today September 5, 2024
person meenewstelugu

NSP కాలువ ఎడమ పరిశీలించిన బిజెపి నాయకులు

మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద NSP కాలువ ఎడమ వైపున" 132" కిలోమీటర్ వద్ద గండిపడ్డ ప్రదేశాన్ని పరిశీలించిన కోదాడ నియోజకవర్గ బిజెపి నాయకులు పరిశీలించడం జరిగినది ఇట్టి గండి పడటానికి ఎన్ఎస్పి అధికారులు కారణమని రైతులు వివరించినారు ఈ గండివలన సుమారు మూడు కిలోమీటర్ల వరద ప్రవాహానికి 300 ఎకరాల వరి పొలాలు మునిగి ఇసుక వేటతో నష్టం జరిగింది మరియు ప్రస్తుతము ఎడమ కాలువ కింద వరి నాట్లు వేసి నెలరోజులు అవుతుందన్న వెంటనే ఈ గండిని తాత్కాలికంగా పూడ్చవలెను ఈ యొక్క తుఫాను వల్ల నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఇట్టి పంట నష్టపరిహారంగా ఎకరాకు రూ 25000/-చొప్పున ప్రభుత్వం చెల్లించాలని ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలకు నష్టం జరుగుద్దని కేంద్ర ప్రభుత్వము రైతులకు వర ప్రధాని అయినా ఫసల్ బీమా యోజన అమలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమును అమలు చేయకపోవడం వల్ల ఈరోజున తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరగడం వలన ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితి ఏర్పడింది కావున ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పసల్ బీమా యోజన ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వెంటనే గళ్ళు పడ్డ కాలవలను మరియు చెరువులను రిపేర్ చేయించాలని మరియు గళ్ళుపడి ఇసుక మేటలు వేసిన భూములకు ఎక్కడకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ కో కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ వంగవీటి శ్రీనివాస్ రావు బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు వెలువోలు చిట్టయ్య నడిగూడెం మండల బిజెపి అధ్యక్షులు దున్నా సతీషు, జిల్లా కిషాన్ మోర్చా నాయకులు రొండ్ల శ్రీనివాస్ రెడ్డి, మల్లెబోయిన వెంకటేష్ యాదవ్, జల్లా జనార్ధన్, సంపెట భాగ్యరాజు , గోపాల రెడ్డి,ఎర్రసైదులు,ఉప్పల్ ముత్యాలు, ఆరే రామకృష్ణారెడ్డి, రొండ్ల రామిరెడ్డి,తుమ్మేటి సురేందర్ రెడ్డి, బట్టు జనానికి రెడ్డి,తుమ్మేటి జయమ్మ, తుమ్మేటి అనిల్ రెడ్డి, అలుగుపల్లి లక్జ్మారెడ్డి, మొదలగువారు పాల్గొన్నారు