schedule Wednesday, August 26, 2026

పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ.

calendar_today September 24, 2024
person meenewstelugu
పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ.

పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ.

మీ::న్యూస్ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కోల రవీందర్ గౌడ్:: పి.డి.ఎస్.యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడుతూ 1974 సం,,లో పి.డి.ఎస్. యూ ఏర్పడిందని, గత 50 సంవత్సరాల కాలంలో విద్య రంగ సమస్యలపై, శాస్త్రీయ విద్యా సాధనకై, సమ సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందన్నారు. 50 ఏళ్ల లో జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,కొలా శంకర్,చేరాలు, మారోజు వీరన్న,రంగవల్లి,యానాల విరరెడ్డి, లాంటి ఎందరో విద్యార్ధి రత్నాలు తమ బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని అన్నారు. విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్టోబర్ 4న, హైదరబాద్ లో ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ లో 24న జరిగే పి.డి.ఎస్.యూ అర్ధ శతాభోత్సవ సభను పూర్వ, ప్రస్తుత పి.డి.ఎస్.యూ కార్యకర్తలు జయప్రదం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు షారోని, పవిత్ర, రాజేశ్వరి, సౌమ్య, మహేష్, నవీన్, తరుణ్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు