మీ::న్యూస్ సూర్యా పేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యా పేట జిల్లా కేంద్రంలోని దూరాజ్ పల్లి నుoడి గరిడేపల్లి వెళ్లే రహదారి దగ్గర, మోడల్ స్కూల్ పక్కన,గుట్టపైన యధేచ్ఛగా అక్రమ తవ్వకాలుమట్టిదందా నడుస్తుంది. పక్కనే పాఠశాల, భారీ శబ్దలతో మట్టి దందా నడుస్తున్నడంతో పాఠశాల విద్యార్థుల కు ఇబ్బందికరంగా మారుతుంది. కొద్దిరోజులుగా మట్టి దందా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.జిల్లా ఉన్నతాధికారులు మట్టి తవ్వకాలపై దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు యధేచ్చగా అక్రమ మట్టి తవ్వాకాలు జరుపుతున్నారు.