మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ప్రముఖ నాయకులు
calendar_today
January 18, 2025
person
meenewstelugu
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ప్రముఖ నాయకులు
మీ న్యూస్ ప్రతినిధి ::: తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బ్యాగరి.హనుమప్ప మరణించిన విషయాన్ని తెలుసుకొని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న, బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మృతుని కుటుంబానికి అంత్యక్రియలకు నిమిత్తం 3000 రూపాయలు అంతారం మాజీ ఉపసర్పంచ్ నక్కల జివరత్నం ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ మృత్తిని కుటుంబానికి ఆర్థిక సాయం గ్రామ నాయకులైన పెండ దేవదానం ద్వారా 3000 రూపాయలు అందజేశారు, ఈ కార్యక్రమంలో బొడ్డే అనంతయ్య సంఘం పుట్రాజ్ తుమ్మలపల్లి నర్సప్ప ఎల్మకన్య సహకార సంఘం డైరెక్టర్ పెండ నర్సిములు . జంగని. లాజర్. పెండ ప్రకాష్. మ్యాతరి. వెంకటయ్యగ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.