మీ న్యూస్ ప్రతినిధి :::మోతే మండలం లో ఈరోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా పలు గ్రామాల లో తెలుగదేశం రాష్ర్ట మాజీ కార్యదర్శి బయ్య నారాయణ గారి అధ్యక్షతన, తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర వాణిజ్య విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి కోడే వాసుదేవ రావు గారి ఆధ్వర్యం లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు మహేష్, రాములు, సైదులు, మెస్సయ్యా, రవి, అఖిల్, వెంకటనర్సయ్య, వెంకన్న, గణేష్, హనుమంతు, నాగేష్, కిషన్, తదితరులు మరియు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని , యుగపురుషునికి ఘన నివాళి అర్పించినారు