schedule Tuesday, August 25, 2026

పేదలకు వరం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ

calendar_today April 1, 2025
person meenewstelugu
పేదలకు వరం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ

పేదలకు వరం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ

మీ న్యూస్ ఏప్రిల్ 01::తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ పేదప్రజలకు వరమని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలం తాళ్ల కాంపాండ్ గ్రామంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానీకి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామిలను 90% అమలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వంఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన , కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 6500 కోట్లు వడ్డిలు కడుతూ 90 లక్షల రేషన్ కార్డు దారులకు సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో సన్నబియ్యం పంపిణీ చేపట్టడం హర్షనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ముదిరెడ్డి రమణారెడ్డి, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, ధరావత్ వెంకన్న నాయక్, తండు శ్రీనివాస్, వల్దాసు దేవేందర్, యాట ఉపేందర్, గ్రామ నాయకులు ముదిరెడ్డి చైతన్య రెడ్డి, మాజి ఉప సర్పంచ్ పాముల సైదులు, ఎన్‌ వెంకటరెడ్డి, పాముల మల్లేష్, నోముల నాగరాజు, ఎలుక సంతోష్, పల్స జానయ్య, చల్లా లింగారెడ్డి, చల్లా కృష్ణారెడ్డి, బూర జానయ్య, శంకర్, వల్లమల్ల రాంబాబు , డీలర్ గోర్ల గన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.